Sunday, February 10, 2013

గర్భిణులూ జాగ్రత్త! కడుపులో బిడ్డలకు కాలుష్యం ముప్పు

వాయుకాలుష్యం తల్లిగర్భంలో వున్న శిశువుల ఎదుగుదలను ఆపేస్తున్నట్టు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల్లో లక్షమంది పిల్లలపై జరిపిన పరిశీలనలో బయటపడింది

2500 గ్రాములకంటే తక్కువ బరువుతో శిశువు పుట్టడానికి మూలం గర్భిణిగా వున్నపుడు తల్లి వాయుకాలుష్యానికిలోనుకావడమేనని తాము సేకరించిన వివరాల నుంచి శాన్ ఫ్రాన్సిక్కో లోని గైనకాలజీ ప్రోఫెసర్ టా్రసీ జె వుడ్రూఫ్ బృందం విశ్లేషించింది. బరువుతక్కువగా పుట్టిన పిల్లలో రోగనిరోధక శక్తి తగ్గి మరణాల రేటు ఎక్కువగా వుంటుంది.

పరిశ్రమల వల్ల మాత్రమేగాక వాహనాల సంఖ్య కూడా రోజూ పెరిగిపోతూండటంతో పట్టణాల్లో నగరాల్లో కాలుష్యసమస్య పెరిగిపోతోంది. పుట్టకముందే గర్భస్ధశిశువులకు ప్రాణాంతకమౌతోంది

గర్భిణులూ! వీలైనంత వరకూ వాయుకాలుష్యానికి దూరంగా వుండటమే బిడ్డలకు రక్ష!!


No comments:

Post a Comment