Saturday, April 20, 2013

సంక్షేమ రాజ్యంపేరుతో అనుత్పాదక వ్యయాల్ని కేవలంఓట్లకోసమే వెదజిమ్మే ధోరణినుంచి ఉత్పాదకత ద్వారా ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచే ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన చంద్రబాబు " కానికాలంలో విత్తనాలు చల్లిన రైతులా" దెబ్బతిని రెండుదఫాలు ఓడిపోయారు.

విజనరీకి 64 ఏళ్ళు

నేడు అరవైనాలుగోయేడు వచ్చిన నారాచంద్రబాబునాయుడు, ఆయన తెలుగుదేశం పార్టీ "అస్ధిత్వ సమస్య" ను ఎదుర్కోడానికి ఆశావిశ్వసాలతో, ఉత్సాహంగా శ్రమిస్తున్నారు. వరుసగా రెండుదఫాలు అధికారంలోకి లేని పరిస్ధితి మళ్ళీవస్తే పార్టీ మనుగడ దుర్భమైపోతుంది. అధినాయకుడిగా ఆవిషయం చెప్పలేని స్ధితిలో వున్న బాబు"ఈసారి గెలిచితీరాలి" అని మాత్రం గట్టిగా చెబుతున్నారు. ఇది అధికారంకోసం వెంపర్లాట కాదు. పార్టీని కాపాడుకునే ఆరాటం మాత్రమే

చంద్రబాబు 18 ఏళ్ళక్రితం మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పుట్టిన వారు-ఊహతెలిసినవారి వయసు ఇపుడు 18 ఏళ్ళనుంచి 30 వరకూ వుంటుంది. ఈ ఏజ్ గ్రూప్ వారిని కొత్తగా తెలుగుదేశం పార్టీవైపు ఆకర్షింప చేయలేకపోవడం పార్టీ సీనియర్లలోపం. ఇందువల్ల తెలుగుదేశం వృద్ధుల పార్టీ అన్న అభిప్రాయం వ్యాపిస్తోంది...మరోవైపు జైల్లోవున్న జగన్...జనంలోవున్న షర్మిళ...మనుషుల్లో లేని వై ఎస్ జ్ఞాపకాలు యువకుల్ని ఆపార్టీవైపు ఆకర్షిస్తున్నట్టే కనబడుతోంది.

ప్రజల అభిమానం వుంది...పనిచేసే శక్తి మాకుంది...నాయకులతోనే సమస్య... అని ప్రతీ నియోజకవర్గంలోనూ కార్యకర్తలు నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదులు చేస్తూండటాన్ని బట్టి "పాతుకుపోయిన నాయకులే పార్టీకి భారమైపోతున్నారని స్పష్టమైపోతోంది

సంక్షేమ రాజ్యంపేరుతో అనుత్పాదక వ్యయాల్ని కేవలంఓట్లకోసమే వెదజిమ్మే ధోరణినుంచి ఉత్పాదకత ద్వారా ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచే ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన చంద్రబాబు " కానికాలంలో విత్తనాలు చల్లిన రైతులా" దెబ్బతిని రెండుదఫాలు ఓడిపోయారు. సంస్కరణలకు ప్రజలు మానసికంగా సంసిద్ధత లేని పరిస్ధితి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘనంగా వుపయోగపడింది. బాబు చేపట్టిన సంస్కరణల ఫలాలు ప్రత్యక్షంగా ప్రజలకు అందుతున్నాయి. పరోక్షంగా రాష్టా్రనికే మౌలిక సదుపాయాలయ్యాయి. సంపదలయ్యాయి.

ప్రజల అభిమానం వుంది...పనిచేసే శక్తి మాకుంది...నాయకులతోనే సమస్య... అని ప్రతీ నియోజకవర్గంలోనూ కార్యకర్తలు నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదులు చేస్తూండటాన్ని బట్టి "పాతుకుపోయిన నాయకులే పార్టీకి భారమైపోతున్నారని స్పష్టమైపోతోంది

చంద్రబాబు జీవితంలో అతిపెద్దవివాదం "వ్యవసాయం దండగమారి" అని ఆయన అన్నారనే! ఆవ్యాఖ్య వెంటనే వివాదం కాలేదు. కాలక్రమంలో కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలకు ముందు ఆ మాటల్ని తవ్వితీసి,నిప్పుపెట్టి రాజేశారు.

ఒకే కమతం మీద ఎక్కవమంది ఆధారపడటం వల్ల వ్యవసాయం దండగమారిదైందని అవసరాలకు మించివున్న మానవవనరులను మళ్ళించడానికి సర్వీసు సెక్టార్ ని సమాయత్తం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. నిజానికి అదే జరిగింది...జరుగుతోంది. గ్లోబలైజేషన్ కిముందే 40/30 ఏళ్ళ క్రితమే మొదలైన అర్బనైజేషన్ వల్లే రైతులు పొలాలను కౌలుకిచ్చి పట్టణాలకు వలసలు పోవడం మొదలైంది. తరువాత కౌలుదారులకూ సాగుదల గిట్టుబాటు కాకుండా పోయింది.

కోడిపిల్లను మళ్ళీ గుడ్డుగా మార్చేయడం అయ్యేపనేనా? ఈ సమస్యకు సర్వీసు సెక్టరే ప్రత్యామ్నాయమని చంద్రబాబు అంటే అది దారుణంగా అపార్ధం చేసుకోబడింది. అయితే ఆయన ఓటమికి ఇదీ కారణమేమోగాని ఇదొక్కటే కారణం కాదు!

రాజకీయంగానూ ప్రజాజీవనపరంగానూ బాబు తప్పులు చేసివుండొచ్చు. అయితే ఒక ప్రణాళికా బద్ధంగా ఒక కంపెనీని అభివృద్ధి చేసినట్టు రాష్టా్రన్ని ప్రగతి వైపు నడిపించిన మరో ముఖ్యమంత్రి ఇంతవరకూ రాష్టా్రనికి లేరు.

*ప్రధానంగా ప్రకృతి ఇష్టాయిష్టాలకు లోబడివున్న వ్యవసాయిక ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు
ఫార్మాస్యూటికల్ హబ్ గా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి హబ్ గా మార్చేశారు - వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించి లక్షలకోట్ల రూపాయలు ఎకానమీలోకి పంప్ అయ్యేలా చేశారు-ఇది వేలాది కుటుంబాల పేదరికాన్ని తొలగించింది-విద్యాబుద్ధులతో ఆకుటుంబాల తరువాత తరం లైఫ్ స్టయిల్ ను మార్చేసింది

*వ్యవసాయంతో పాటు ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ సెక్టార్ల లను అభివృద్ధిచేయడం ద్వారా ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలను చంద్రబాబు సృష్టించారు.

*ఒకప్పుడు బీహార్ లా వెనుకబడి వున్న ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక వాతావరణాన్ని చంద్రబాబు సృష్టించి ప్రోత్సహించడం వల్ల ఆయన హయాంలోనే మహారాష్ట్రకు ధీటుగా మన రాష్ట్రం నిలబడింది

* పారదర్శకతను పరోక్షంగా ప్రజల భాగస్వామ్యాన్నీ పెంచే ఇ - గవర్నెన్స్ ను దేశంలోనే మొదటిసారిగా తీసుకువచ్చింది చంద్రబాబే

* బ్యాంకు బ్రాంచిలంత విసృ్తతంగా ఇ సేవా కేంద్రాలు ఇచ్చి ప్రజలకు అధికారుల్ని జవాబుదారీలుగా మార్చింది చంద్రబాబే

* ఆదరణ పధకాల ద్వారా బిసి ల కుటుంబాల సామాజిక ఆర్ధిక రాజకీయ స్ధాయిని దేశంలో మరెక్కడా లేనంత వున్నతంగా తీర్చిదిద్దింది చంద్రబాబే.

* విద్యుత్ సంస్కరణలు చేపట్టి 5000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయించించి చంద్రబాబే

*32 ఇంజనీరింగ్ కాలేజీలను 210 కి పెంచి ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీఫ్రంట్ లో తెలుగు పిల్లలు రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో మంచి ఆదాయాలతో ఉన్నత స్ధానాల్లో వుండేలా చేసింది చంద్రబాబే.

*మహిళా సాధికారికత కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను స్ధాపించి 65 లక్షల మంది స్త్రీల వికాసానికి బాటలు వేసింది చంద్రబాబే

1978లో రాజకీయాలలోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు - అంజయ్య, భవనం, కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్ లలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశంలో ప్రవేశించి అత్యంత క్రియాశీల పాత్ర పోషించి 1995 సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి అయ్యారు. రెండువేల నాలుగు వరకు రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ఆ తర్వాత తొమ్మిదేళ్లుగా విపక్ష నేతగా కూడా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మూడువేల కిలోమీటర్ పాదయాత్రలో ఉండి మరో కొత్త రికార్డు సృష్టించారు.