Tuesday, February 12, 2013

"స్ధానిక"ఎన్నికలు - మహిళా రిజర్వేషన్ల పైనే ముఖ్యమంత్రి కిరణ్ ఆశలు?

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడానికి కాంగ్రెస్ సిద్దంగా వుందని ఉత్సాహపడటానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఓ లెఖ్ఖుంది. అయితే జగన్ ముందు ఈ లెఖ్ఖలు తుక్కయిపోతాయని వేరువేరు మాటల్లో నలుగురు ఎమ్మెల్యేలు'తెలుగు రిపోర్టు'తో అన్నారు

తన టీమ్ సామర్ధా్యనికి సూచికలుగా ఢిల్లీ పెద్దలకు చూపించుకోడానికే సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు కిరణ్ కు ఉపయోగపడ్డాయి. 2010 అక్టోబర్ నుంచీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వున్న మున్సిపాలిటీలకు 2011 ఆగస్టునుంచీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వున్న పంచాయతీలకు ఎన్నికలు జరిగితే వాటి ఫలితాలు ప్రజల మూడ్ ని అర్ధంచేసుకోగల సూచికలయ్యే అవకాశం వుంది.

తెలంగాణా ఉపఎన్నికల గాయాలు మానని స్ధితిలో, స్ధానిక సంస్ధల ఎన్నికలకు 6 నెలలక్రితం కూడా ఆసక్తి చూపని ముఖ్యమంత్రి ఇపుడు ఎన్నికలకు సిద్ధమైపోయినట్టు ఆయన ఇంటరూ్వ్యలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ జైల్లోవుండగా గ్రామస్ధాయినుంచి ఆపార్టీ నిర్మాణమే లేకపోవడం, చంద్రబాబు పాదయాత్రలో వుండటం తమకు అనుకూలమని స్ధానిక ఎన్నికల నిర్వహణకు ఇదే అదను అని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. తన ఇందిరమ్మ యాత్రలు, సంక్షేమ కార్యక్రమాలు, స్ధానిక సంస్ధల ఎన్నికలకు ప్రతిపాదించిన రిజర్వేషన్లు కాంగ్రెస్ ను గెలిపిస్తాయన్నది కిరణ్ నమ్మకం
50%సీట్లు స్త్రీలకు రిజర్వు చేయాలన్న ప్రతిపాదనను మొత్తం కేటగిరీలలో అంటే ఎస్ సి, ఎస్ టి, బిసి, జనరల్ కేటగిరిలలో అమలు చేస్తే మొదటిసారి పదవులకు ఎన్నికైన మహిళలు వారిని ఎన్నుకున్న మహిళలు కాంగ్రెస్ వైపే వుంటారన్నది ఒక సిద్ధాంతం. ఇప్పటికే ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి అదనంగా కొత్త ఓటు బ్యాంకును సృష్టించే ఆలోచన ఇది.

చట్టపరంగాకాని ఇతరత్రాకాని మరే ఇబ్బందీలేకపోతే ముఖ్యమంత్రి అనుకున్న ప్రకారం 22 జిల్లా పరిషత్తులకు 11,- 1097 జడ్పిటిసిలకు 549,-16148 ఎంపిటిసిలకు 549,-1097 మండలాధ్యక్ష స్ధానాలకు 549,-.....ఇలా సగానికి సగం పదవులు మహిళలకు రిజర్వు అవుతాయి. 108 మున్సిపాలిటీల, 16 కార్పొరేషన్ల పదవుల్లో కూడా సగం పదవులు స్త్రీలకే కేటాయించబడుతాయి.

ఆయితే బిసి రిజర్వేషన్ల పై ఇప్పటికే ఒక వివాదం సుప్రీం కోర్టులో వుంది. రిజర్వేషన్ల అమలుకి 2001 జనాభాలెక్కల్ని ప్రాతిపదికగాతీసుకోవాలా 2011 లెక్కల్ని తీసుకోవాలా ఇంకా రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఇవేమీ సమస్యలు కాదని ఢిల్లీ సరేనంటే ఎన్నికలకు ముఖ్యమంత్రిసిద్ధమేనని పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యే ఒకరు చెప్పారు

ఇక్కడి జనం నాడి తెలియని ఢిల్లీ పెద్దల్ని రూములో కూర్చోబెట్టి చెప్పడానికిఇలాంటి లెక్కలు బాగుంటాయని ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సీట్లను జగన్ పార్టీ తన్నుకుపోవడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. ముఖ్యమంత్రి మాత్రం తాడోపేడో తేల్చుకునే ఎన్నికలకే సిద్ధమౌతున్నట్టు వారి మాటల్ని బట్టి అర్ధమౌతోంది






No comments:

Post a Comment