Saturday, February 16, 2013

జూన్ తరువాత ప్రధాని ఎవరు? - 'ముందస్తు' పరిష్కారం!

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ఈఏడాది జూన్ 14 న ముగుస్తుంది. ఆయన ప్రజలు నేరుగా ఎన్నుకునే లోక్ సభనుంచిగాక అస్సాంనుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మన్మోహన్ అనుకుంటే మళ్ళీ రాజ్యసభనుంచి ఎన్నిక కావడం కేవలం లాంఛనమే! అయితే ఇక పోటీ చేసే ఉద్దేశ్యం తనకులేదని ఆయన స్పష్టం చేసేశారని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

ఇపుడు అధికారంలో వున్న 15 వలోక్ సభ పదవీకాలం 2014 ఫిబ్రవరిలో ముగుస్తుంది. మన్మోహన్ పదవి ఖాళీ అయితే లోక్ సభ కాలం ముగిసేవరకూ మరెవరినైనా ప్రధానిగా నియమించవలసివుంటుంది. అదిఇష్టంలేని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టుంది.

సోనియానుంచి నిర్ణయాధికారాలు రాహుల్ కు అధికారికంగా బదిలీఅయ్యాయి. పార్టీ ఉపాధ్యక్షుడిగా అయన బాధ్యతల స్వీకారంతో ఇది మొదలైంది. పార్టీలో ఆయన సొంత, కొత్త విధానాల అమలు మొదలయినట్టుంది.

కాంగ్రేస్, మిత్రపక్షాలు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారు. మన్మోహన్ సింగ్ కుర్చీ ఖాళీచేశాక రాహుల్ ఆ పదవిలోకి వచ్చేలోగా మరో వ్యక్తి ఆస్ధానంలోకి రావడం వల్ల చరిత్రలో అది నమోదౌతుందేతప్ప అందువల్ల దేశానికీ కాంగ్రెస్ కీ ఏప్రయోజనమూ వుండదు. ఈ పరిస్ధితి లేకుండా చూడాలంటే మన్మోహన్ రాజీనామా చేసినపుడే లోక్ సభను రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలి. ఆకొద్దిపాటివ్యవధిలోప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్ డి ఎ ముందుకురాదు. అంటే ముందస్తు ఎన్నకలు తప్పేలాలేవు. పార్టీతో రాహుల్ కసరత్తులన్నీ ఈ సంకేతాన్నే ఇస్తున్నాయి.

బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే లోక్ సభ రద్దుకావచ్చు.ఆ తతంగమంతా సజావుగా ముగించడనికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనుభవం కాంగ్రెస్ కి బాగావుపయోగపడుతుంది

లోక్ సభ రద్దయిన 6 నెలల్లో ఎన్నికలు జరగాలి అంతవరకూ మన్మోహన్ సింగ్ ఆపద్ధర్మ ప్రధానిగా వుంటారు. అంటే 2013 అక్టోబర్ నవంబర్ నెలల్లో లోక్ సభ ఎన్నకలు జరిగే సూచనలు అర్ధమతున్నాయి






No comments:

Post a Comment