Monday, February 11, 2013

గురు ఉరిలో రాజకీయాలు లేవని కాంగ్రెస్ నమ్మింపజేస్తుందా

"అఫ్జల్ గురుని ఉరితీయడం వెనుక రాజకీయ కారణాలులేవని కేంద్రనాయకత్వం, న్యాయవ్యవస్ధ స్పష్టం చేయవలసి వుంది" జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా డిమాండ్ లాంటి స్వరంతో ఐబిఎన్ లైవ్ ఛానల్ లో ఈమాటలు చెప్పారు. అంతేకాకుండా ఆక్లిప్పింగ్ లింకుని ఇవేమాటలతో స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ముంబాయిలో టెర్రరిస్్ట దాడులో పాకీస్ధానీయుడైన అజ్మల్ కసబ్ స్వయంగా పాల్గొన్నాడనడానికి తిరుగులేని వీడియో ఫుటేజితో సహా అనేక ఆధారాలువున్నాయి. అతన్ని ఉరితీయడం వివాదం కాలేదు. పార్లమెంటుపై దాడిలో అఫ్జల్ గురు ప్రత్యక్షంగా లేడు. కోరు్ట విచారణలో గురు నేరం నిస్సందేహంగా రుజువుకాలేదన్న అభ్యంతరాలు వున్నాయి. కేవలం 'సర్కమసె్టన్స్ ఎవిడెన్స్ ' ఆధారంగా ఇంత పెద్ద శిక్ష వేయకూడదన్న వాదన వుంది. ఏమైనా పార్లమెంటు పై దాడి దేశవ్యాప్తంగా ఒక ఉద్వేగాన్ని రగిలించింది. వాదోపవాదాలను న్యాయవ్యవస్ధ ఉద్వేగాలకు అతీతంగా పరిశీలించే తీర్పు ఇచ్చిందని నమ్మే కోటాను కోట్లమందిలో నేను కూడా ఒకడిని.

ఆతనికి ఉరిశిక్ష అవసరమా కాదా అన్న చర్చలోకి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ వెళ్ళడం లేదు. అయితే పాకిస్ధాన్ పొరుగునే వున్న జమ్ము కాశ్మీర్ లో ఈ వురిశిక్ష ప్రభావం ముఖ్యంగా యువకుల మీద సుదీర్ఘకాలం వుంటుందని ఆయన ఆందోళన పడుతున్నారు.
"ఈ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేము. 1984 లో కాశ్మీర్ కు చెందిన ఉగ్రవాది మక్బుల్ భట్ ను ఉరితీసిననాటి పరిస్ధితులు వేరు. ఇపుడు యువకులు అఫ్జల్ గురు లో "తమని తాము" చూసుకుంటున్నారు" అని ఓమర్ అబ్దుల్లా వివరించారు.

గురు కుటుంబానికి చివరిసారి అతన్ని చూసే అవకాశం ఇవ్వకపోవడాన్ని ఏవిధంగానూ సమర్ధించుకోలేమని ఆయన వ్యాఖ్యానించారు " మనం ఏకాలంలో వున్నం స్పీడ్ పోస్ట్ ద్వారా తెలియజేయడం ఏమిటి ఈ బాధ్యత ప్రత్యేకంగా ఒక అధికారికి అప్పగించి వుండొచ్చుకదా" అని అసహనాన్ని వ్యక్తంచేశారు.

అఫ్జల్ గురు ఉరి జమ్ము కాశ్మీర్ నుకలవరపెడుతోంది. 2006 లోనే కోర్టు ఉరిశిక్షవేసినా దాన్ని అమలు చేయడానికి కేంద్రప్రభుత్వం 7 ఏళ్ళ సమయం తీసుకుంది. నిర్ణయరాహిత్యాని్న దుమ్మెత్తి పోసిన బిజెపి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ ని, ప్రధాని రాజీవ్ గాంధీని చంపిన వారు ఉరిశిక్షలు పడి జైల్లో వున్నా వారిని ఉరితీయాలని డిమాండ్ చేయడం లేదు. బిజెపి హిందూత్వ భావనలు వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో అఫ్జల్ గురు శిక్షపై ఏడేళ్ళ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని'కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకే' నని ఈ శిక్షఅమలును స్వాగతిస్తున్న సామాన్యులు కూడా నమ్ముతున్నారు.

ఈ స్ధితిలో కాంగ్రెస్ తో అంటకాగడం కష్టమేనన్న నిష్టూరం ఓమర్ అబ్దుల్లా మాటల్లో గట్టిగానే ధ్వనిస్తోంది. ఏమైనా జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి కోరుతున్నట్టు 'గురు ఉరితీతలో రాజకీయ కారణాలు లేవని ప్రజలను నమ్మంపజేయడం' కాంగ్రెస్ కు అసాధ్యమే అవుతుంది.
ఉరితీత ద్వారా హిందూ సమాజానికి ఓ సంకేతం ఇవ్వాలన్నదే పాలక పక్షం ఉద్దేశ్యమై వుంటే ఓమర్ అబ్దుల్లా స్పందనపై ఏ ప్రతిస్పందనా వుండదు కూడా.

No comments:

Post a Comment