Friday, April 5, 2013

రిజిషే్ట్రషన్ సమయంలోనే "సర్వర్ డౌన్" లోవున్నా ఆప్ అయ్యేవరకూ ఓపిగ్గా వేచివున్న 2000 మంది ఐటి విద్యార్ధులు భారత ప్రభుత్వ తొలి Hackathon లో 12 వ ప్రణాళిక అమలులో ప్రజలచేతికి టెక్నాలజీ ని ఇవ్వడానికి ఉవ్విళ్ళూరుతున్నారు...




2017 తో ముగిసే పంచవర్షప్రణాళికా కాలంలో పేదరికం నిర్మూలన, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, విద్య-నైపుణ్యాల గుర్తింపు మెరుగుదల, ఇంధనం, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి, పర్యావరణం మొదలైన విషయాల్లో టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి?

సమాధానాల కోసం కేంద్ర ప్రణాళికా సంఘం దేశంలో మొదటిసారిగా ఏప్రిల్ 6,7 తేదీల్లో మొత్తం 32 గంటల పాటు "హాక్ థోన్" నిర్వహిస్తోంది. దీన్ని 2000 మందికి పైగా సాప్ట్ వేర్ డెవలపర్లయిన యువతీ యువకుల మహాసమ్మేళనం అనుకోవచ్చు.

వీరంతా ఒకేచోట వుండరు. ఢిల్లీ, ఆగ్రా, ముంబై, బెంగుళూరు, కాన్పూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఐఐటి, ఐఐఐటి, ఇతర ప్రతిష్టాత్మక ఐటి సంస్ధల విద్యార్ధులు వారివారి క్యాంపస్ లనుంచే ఇందులో పాల్గొంటారు.

రెండుదశల్లో పార్టిసిపెంట్స్ రిజిష్టే్రషన్ పూర్తయింది. 12 ప్రణాళికా లక్ష్యాలు వనరులు మొదలైన అన్ని వివరాలూ వున్న కౌ్లడ్/సర్వర్ ఏక్సెస్ ముందుగానే అవగాహన ఏర్పరచుకోడానికి ఇప్పటికే వారికి లభించింది.

ఆరో తేదీ ఉదయం 11గంటలకు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ మాంటేక్ సింగ్ ఆహ్లూవాలియా సాంకేతిక సలహాదారు సాంపిటో్రడా, సెక్రటరీ సింధుశ్రీ కుల్హార్ వెబ్ కాస్ట్ లో ఉపన్యసిస్తారు. పార్టిసిపెంట్స్ ప్రశ్నలకు సమాధానాలిస్తారు.

ఈ ఆవగాహన 12 ప్రణాళికా అమలులో ప్రజలకు సుళువుగా ఉపయోగపడేలా సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్, అప్లికేషన్స్, మొబైల్ ఫోన్లమీదకూడా పనిచేసే అప్లికేషన్లను డెవలపర్లు తయారు చేస్తారు.

"ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది" అంటే ఇదే!

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ డెవలప్ మెంటులో భారతీయ యువతీయువకుల స్ధానం 30 శాతం కంటే ఎక్కువే. ఇలాంటి నైపుణ్యాన్ని ప్రజాప్రయోజనాలకోసం వినియోగించుకోవాలన్న కేంద్రప్రణాళికా సంఘం ఆలోచన అభినందనీయం

దేశంలోనే మొదటి "సాంకేతిక నిపుణుల సమ్మేళనం (Hackathon) లో పాల్గొనడానికి ఉవ్విళ్ళూరుతున్న యువశక్తి రిజిష్టే్రషన్ కోసం ప్రయత్నంచిన ప్రతీసారీ 'సర్వర్ డౌన్' అన్న సమాధానం రావడమే చిన్న నిరుత్సాహమైంది.

ఫరవాలేదు ఏప్రయాణమైనా చిన్న అడుగుతోనే ప్రారంభమౌతుంది

(ఆసక్తి వుంటే ఈ లింకులుచూడండి)

data.gov.in/hackathon
or
follow the Planning Commission on
Twitter (@PlanComIndia)
and Facebook
(facebook.com/PlanComIndia).


First Ever Hackathon by the Planning Commission on 6-7 April

Sh. Montek Singh Ahluwalia and Sh. Sam Pitroda to deliver the opening address

More than 1900 participants at 10 locations across the country have registered for the first ever 32 hour Hackathon by the Planning Commission on the 12th Plan. The locations include University of Jammu, IIT Delhi, Delhi University, Aligarh Muslim University, IIT Kanpur, IIT Kharagpur, TISS Mumbai, IIIT Hyderabad, IISc Bangalore and IIT Madras.

The Hackathon will be held on 6th and 7th April, 2013. The opening address will be conducted via a webcast at 11 AM on 6th April by the Deputy Chairman of the Planning Commission, Sh. Montek Singh Ahluwalia, Adviser to PM, Sh. Sam Pitroda, and Secretary, Planning Commission, Smt. Sindhushree Khullar. The webcast can be viewed live by the public at webcast.gov.in/hackathon. To answer questions on the Hackathon, Sh. Montek Singh Ahluwalia and Sh. Sam Pitroda will be doing a live chat with BBC India via its Facebook page http://www.facebook.com/bbchindi.

Participants in the Hackathon will compete for prizes in three categories - mobile/web applications, infographics and short films. The sectors shortlisted for the Hackathon are Macroeconomic Framework, Health, Urban Development, Education and Skill Development, Energy, Agriculture and Rural Development, and Environment. Additionally, the Hackathon also features the unique “UnCover the Event” competition, where amateur event journalists will live-tweet, blog, and document the Hackathon. The winners of the best UnCover submissions will receive an audience with filmmaker, Shekhar Kapur.

For more information, please visit the 12th Plan Hackathon website at data.gov.in/hackathon or follow the Planning Commission on Twitter (@PlanComIndia) and Facebook (facebook.com/PlanComIndia).

*******




Thursday, April 4, 2013

సంజయా దత్ క్షమాభిక్ష తో రేపోమాపోస్వేచ్ఛా జీవి అవుతాడు! అదేకేసులో జైల్లో నిట్టూర్చే జేబురున్నీసా కష్టం మాత్రం ఈ దేశంలో పెద్దవాకికోన్యాయం పేదవాడికోన్యాయం అనే ధ్వంధ్వ నీతికి ఒక సాక్ష్యమై వెక్కిరిస్తూవుంటుంది

సంజయ్ దత్ సరే
జేబురున్నీసా అంతేనా

సంజయ్ దత్ ని క్షమించాలని గవర్నర్ కు 8 విజ్ఞాపనలు అందాయి. ఆ నటుడికి చట్టవిరుద్ధంగా మాఫియా ఆయుధాలు ఇచ్చేముందు వాటిని కొన్ని గంటలు దాచి వుంచిన నేరానికి యావజ్జీవిత జైలు శిక్ష అనుభవిస్తున్న 70 ఏళ్ళు పైబడిన వృద్ధురాలు జేబున్నీసా గురించి ఆలోచించేవారే లేరు.

ఇందుకు తప్పుపట్టవలసింది ఖచ్చితంగా మీడియానే...
సెలబ్రెటీల మీదే ఫోకస్ వుంచడానికి అలవాటు పడిపోయిన సమాచారసాధనాలు పబ్లిక్ ఒపీనియన్ ని రూపొందించడంలో (ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా) ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయు. నిరుపేదల్ని విస్మరిస్తున్నాయి.

సంజయ్ దత్, జేబురున్నీసాల "నేర" నేపధ్యం 1992 బాబ్రీ విధ్వంసం..ఆతరువాత 253 మందిని చంపి 1000 మందిని గాయపరచిన ముంబై బాంబు పేలుళ్ళు..ఆఅల్లర్ల తరువాత ముస్లింలను శివసేన హింసించినపుడు సంజయ్ దత్ తండ్రి నటుడు, కాంగ్రెస్ నాయకుడు సునీల్ దత్ ప్రాణాలకు తెగించి ముస్లింలను ఆదుకున్నారు.

తండ్రి నుంచి తెగువను గాక నటవారసత్వం మాత్రమే అందుకున్న సంజయ్ ప్రాణభయంతో ఆయుధాలు దగ్గరుంచుకోవాలనుకున్నాడు. సినిమారంగాన్ని చెప్పుచేతల్లో వుంచుకున్న మాఫియా డాన్ దావూద్ తమ్ముడిని అనేక సార్లు స్వయంగా కలసి డీల్ కుదుర్చుకున్నాడు.

అవి ముంబాయిని చీకటి ప్రపంచం రాజ్యమేలినరోజులు. రాజకీయవేత్తలు, సంపన్నులు, వ్యాపారులు, రియల్టర్లు, సినిమారంగం దావూద్ తో పరిచయాన్నే గొప్పగా చాటుకున్న కాలం..చీకటి ప్రపంచపు ప్రాపకంకోసం ఉవ్విళ్ళూరిన వేలమందిలో సంజయ్ ఒకడు మాత్రమే.

దావూద్ తమ్ముడు అనీస్ ఇబ్రహీం ఇంటికి సమీపంలో నివాసముండటమే జేబురున్నీసా చేసిన నేరం..ఐదుగురు ఆడపిల్లలతో సంసారాన్ని ఈడ్చుకొస్తున్న ఈ పేదమహిళ ఇంట్లో ఆయుధాల సంచిని అనీస్ దాచివుంచాడు. ఆసంచినే తరువాత సంజయ్ కి అందజేశారు.

దర్యాప్తులో జేబురున్నీసా మీద సంజయ్ మీదా 'టాడా'కేసులు పెట్టారు.తదుపరి దర్యాప్తులో సంజయ్ వద్ద ఆయుధాలు ఉగ్రవాదుల దాడుల కోసం కాదని అధికారులు నమ్మారు. వారి అభిప్రాయాన్ని కోర్టు ఆమోదించి ఆయన పై టాడా కేసు ఉపసంహరించింది.

ఆదశలో కూడా జేబురున్నీసా ను ఎవరూ పట్టించుకోలేదు. ఆమెవద్ద వుంచిన ఆయుధాల తీవ్రతకూడా ఆమెకు తెలియదు. స్వయంగా ఆమె తీవ్రవాది అయివుంటే వేరే విషయం. అత్యంత ప్రముఖులే మాఫియాకు మోకరిల్లిన (మోకరిల్లుతున్న)కాలంలో ఈ మహిళ వారి ఆయుధాలు దాచివుంచిన నేరానికి టాడా కింద జీవిత ఖైదీగా ఇరుక్కుపోయింది. పేదరికం కారణంగా పట్టించుకునే వారు లేక అక్కడే మగ్గిపోతోంది.

టాడా నుంచి బయట పడిపోవడమే సంజయ్ దత్ కు పెద్ద ఊరట. అక్రమాయుధాల కేసులో ఇంకా మూడున్నర ఏళ్ళ శిక్ష అనుభవించవలసిందేనని కోర్టు స్పష్టంచేశాక ఆయన పరితాప, కోర్టు విధేయతా ప్రకటనలు మొదలవ్వకమందే సంజయ్ కు క్షమాభిక్ష పెట్టాలన్న సన్నాయి రాగాలు కాంగ్రెస్ లోని అత్యున్నత పవర్ కేంద్ బిందువైన రాహుల్ గాంధీ "సొంతమనిషిలా"పరిగణన వున్న దిగ్విజయ్ సింగ్ అందుకున్నారు..అపుడే అర్ధమైపోయింది కొంత తంతు ముగిశాక సంజయ్ కు క్షమాభిక్ష మంజూరౌతుందని. ఏకంగా 8 మంది మహారాష్ట్ర గవర్నర్ కు విజ్ఞాపనలు చేయడంద్వారా ఈ తంతు మొదలు పెట్టేశారు.

అధికారంలో వుండే లెక్కల్లో కూడికలు తీసివేతల లెఖ్ఖల్నేచూసే రాజకీయ ప్రయోజనాల ముందు న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు వెనక్కి పోతాయంటే కొంతఅర్ధం చేసుకోవచ్చు

సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఖట్జూ కూడా స్వయంగా "సంజయ్ క్షమాబిక్ష" క్యాంపెయిన్ ప్రారంభించడమే ఆశ్చర్యం...విచారకరం.

టాడా కేసునుంచి సంజయ్ ని బయట పడెయ్యడానికి సహకరించిన దర్యాప్తు అధికారుల వివరాలు వారి వాంగ్మూలాల్లోనే వుంటాయి. వారందరి మీదా చార్జిషీట్లు వేయడానికి బదులు ఈ కేసులో కూడా రాయితీలకు లాబీయింగ్ చేస్తున్న పెద్దలకు జనం ఏమనుకుంటారన్న సిగ్గులేదు సరే! మనస్సాక్షి కూడా వుండదా?

సంజయా దత్ క్షమాభిక్ష తో రేపోమాపోస్వేచ్ఛా జీవి అవుతాడు! అదేకేసులో జైల్లో నిట్టూర్చే జేబురున్నీసా కష్టం మాత్రం ఈ దేశంలో పెద్దవాకికోన్యాయం పేదవాడికోన్యాయం అనే ధ్వంధ్వ నీతికి ఒక సాక్ష్యమై వెక్కిరిస్తూవుంటుంది

సంజయ్ కుక్షమాభిక్ష దొరుకుతుంది... జేబురున్నీసా మాత్రం జైల్లోనే పెద్దలకో న్యాయం పేదలకో న్యాయంలా నిలుస్తుంది