Saturday, February 9, 2013

అఫ్జల్ గురు ఉరి పర్యావసానాలు

అఫ్జల్ గురు ఉరి ప్రభావాలు, పర్యావసానాలు గట్టిగానే వుండొచ్చు (వుండకపోనూ వచ్చు). మరణశిక్ష పడి పాకిస్ధాన్ జైల్లో మగ్గుతున్న భారతీయ శిక్కు సర్బజిత్ సింగ్ ని చంపెయ్యిలని పాకీస్ధానీయుల నుంచి ఆ ప్రభుత్వం మీద వత్తిడి పెరుగడం సహజమే. ఆసెంటిమెంటు ని పాకిస్ధాన్ అమలుచేస్తే మనదేశం శిక్కుల్లో అలజడి పెరుగుతుంది. అది మళ్ళీ ఖలిస్ధాన్ డిమాండుకి ఉపిరియిస్తుంది.

అఫ్జల్ గురు పై నేరం నిస్సందేహంగా రుజువుకాలేదని ఇందులోఆయన బలిపశువని ఇప్పటికే వాదనవున్న నేపధ్యంలో ఉరి శిక్ష అమలు కాశ్మీర్ లో అలజడులు పెంచుతుంది. సరిహద్దున అశాంతి కూడా దేశానికి మంచిది కాదు. బహుశ ఈ కారణాలవల్లే ఉరి అమలును ప్రభుత్వం ఇంతకాలమూ పెండింగ్ లో వుంచివుండవచ్చు. సమాచార సాధనాల ఆధారంగానే సామాన్య ప్రజల్లో అభిప్రాయాలు రూపుదిద్దుకుంటాయి. ప్రభుత్వాని కుండే ఇంటెలిజన్స్ వ్యవస్ధల నుంచి లభంచే ఖచ్చితమైన శాస్త్రీయమైన ఆధారాల ప్రాతిపదికగానే తుది నిర్ణయాలు వుంటాయి. ఇందువల్లే చాలా సందర్భాల్లో "పాపులర్ ప్రజాభిప్రాయాలకూ ప్రభుత్వ చేతలకూ పొంతన వుండదు. ఉన్నత స్ధాయిలో నిర్ణయరాహిత్యానికి చాలా సందర్భాల్లో వ్యక్తుల చొరవలేకపోవడం ఒక కారణమౌతుంది...ఉగ్రవాద నిర్మూలనపై అంతర్జాతీయ సానుకూలతలు.."పెద్దన్న" అమెరికా పట్టుదల, విద్యావంతులైన యువతరం జనాభాలో విస్తరిస్తున్నందువల్ల ప్రజల ఆలోచనల్లో మార్పులు కూడా నిర్ణయరాహిత్యం నుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, హోంమంత్రి షిండే లను నిర్ణయం తీసుకునేవైపు నెట్టివుంటాయనిపిస్తుంది. అన్నీ అనుకూలించినా చొరవతక్కువ మనుషులైతే 'అధికారుల సలహామేరకు' ఫైళ్ళలాగే పడివుంటారు.

కసబ్,గురు ఉరిశిక్షలను కాంగ్రెస్ పార్టీ తప్పక రాజకీయప్రయోజనాలకు ఉపయోగించుకుంటుంది..ఈ పర్యావసానాల్లో ఎదురు దెబ్బలు తగిలితే షిండే బలిపశువౌతారు. ప్రణబ్ అపనిందలు మూటగట్టుకుంటారు

No comments:

Post a Comment