Monday, March 4, 2013

(వై ఎస్ స్టైలే ?) పార్టీకంటే పెద్దదౌతున్న మోడీ నీడ!

బిజెపి జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఆదివారం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి వ్యాఖ్యానాలు బిజెపి కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్దం దిశను మార్చేసే దశగా కనిపిస్తున్నాయి.

బిజెపి 2009 ఎన్నికల తరువాతనుంచి చైతన్యాన్ని క్రమంగా కోల్పోతూండగా కార్పొరేట్ బినామీల వ్యవహారంలో అప్పటి బిజెపి అధ్యక్షుడు గడ్కారి చిక్కుకోవడంతో పార్టీ మరింత మసకబారినట్టయింది. ఇంకోవైపు మోడీ 'సుపరిపాలన' విదేశాల్లో కూడా ఖ్యాతిగడిస్తోంది.'లక్షలాది కార్యకర్తలవల్లే ఇదంతా' అని మోడీ నమ్రతా భావాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఆయన ఇమేజ్ మాత్రం బిజెపికంటే చిక్కగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తగానే కాంగ్రెస్ కంటే ఎలా ఎత్తుకి ఎదిగిపోయారో మోడీ బిజెపిలో అంతకు మించిపోయారు.

నాయకులు కూడా ఒకవిధమైన స్తబ్ధతతో వుండగా జాతీయ కౌన్సిల్ సమావేశపు వేదికను మోడీ చాకచక్యంగా వినియోగించుకున్నారు. "ఆకుటుంబం కోసం దేశాన్నే కాంగ్రస్ తాకట్టుపెట్టేసింది , ఆకుటుంబ వాచ్ మన్ లా బలహీన ప్రధానిని దేశానికి ఇచ్చంది" అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు బిజెపి యుద్ధలక్ష్యం 'ఆకుటుంబమే' అనే సూచనను ఇస్తున్నాయి. ప్రణబ్ 'ముఖర్జీ ప్రధాని అయివుంటే దేశానికి కొంతైనా మేలు జరిగేది' అన్న మోడీ మాటల్లో కాంగ్రెస్ లో చిచ్చు పెట్టే వ్యూహం కనబడుతోంది.

2014 ఎన్నకల్లో బిజెపి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీనే ప్రకటించేలా చూడటానికి ప్రతీ అవకాశాన్నీ వాడుకుంటున్న మోడీకి ప్రతీసారీ క్యాడర్ ని ఘనంగా ఉత్తేజపరుస్తూనే వున్నారు. ప్రధాని పదవికి అభ్యర్ధిగా ప్రకటింపచేసుకునే ప్రయాణంలో వేగంగా మెట్లెక్కేస్తూనే వున్నారు.




No comments:

Post a Comment