Monday, February 4, 2013

సహకార సంఘాల ఎన్నికలు - చేతులెత్తేసిన తెలుగుదేశం!

మినహా సహకార ఎన్నికల్లో (ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు మినహా) తెలుగుదేశం పార్టీ చేతులెత్తేసినట్టు స్పష్టమైపోయింది.

పదవీకాలం ముగిసేనాటికి సంఘాల అద్యక్షులుగా వున్నవారినే పర్సన్ ఇన్ చార్జ్ లుగానియమించి ఆతరువాత సభ్యత్వాల నమోదు...ఎన్నికల నిర్వహణలను ప్రభుత్వం పూర్తి చేసింది. పాత అధ్యక్షులే పర్సన్ ఇన్ చార్జ్ లుగా వుండటం వల్ల ఏర్పడిన "అనుకూలత" నుంచి పెరిగిన కాంగ్రెస్ ఓటర్ల సంఖ్య 40 వేలని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వారు అధ్యక్షులుగా వున్న సంఘాల పర్సన్ ఇన్ చార్జలు వారే కనుక వారుకూడా కొత్త ఓటర్లను చేర్పించే అవకాశం వుంది. అయితే ఖమ్మం రంగారెడ్డి జిల్లాల్లో తప్ప మరెక్కడా తెలుగుదేశం ఇందుకు పూనుకోలేదని ఫలితాలే చెబుతున్నాయి. అన్ని రకాల "వ్యయ ప్రయాసలనూ" జనరల్ ఎన్నికలకే దాచివుంచుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నట్టున్నారు. ఏమైనా సహకార సంఘాల ఎన్నికల్లో చేతులెత్తేసిన తెలుగుదేశం నాయకులు రానున్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఏంచేయనున్నారో చూడాలి

దిగువ స్ధాయివరకూ పార్టీ నిర్మాణమే లేని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకార ఎన్నకల్లో తెలుగుదేశం పార్టీ కంటే బాగా కృషిచేసినట్టే వుంది. ఇది ఎక్కడి కక్కడ ఆ పార్టీ కార్యకర్తలు సాధించుకున్న ఫలితమే తప్ప పార్టీ వ్యూహాల ఫలితం ఏమాత్రమూ కాదు!

No comments:

Post a Comment