Monday, January 28, 2013

ఆజాద్ రాయలసీమనూ రాజేస్తున్నారా?

రాష్ట్ర రాజకీయవేదికమీద కొన్నేళ్ళుగా "తెలంగాణా" , "సీమాంధ్ర" పాత్రలే ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. "జై ఆంధ్ర", "ఉత్తరాంధ్ర", "రాయలసీమ" నినాదాలు అపుడపుడూ వినబడుతున్నా వాటి ప్రాధాన్యత ఇంతవరకూ పెద్దగా లేదు. కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ 'ఇంకా చర్చలు జరగవలసివుంది మూడు ప్రాంతాల నాయకులనూ పిలిచి మాట్లాడాలి. పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రిలను పిలిచి మాట్లాడాలి' అని కొత్తగా ప్రకటించడం ద్వారా "సీమాంధ్ర" ఐక్యత నుంచి రాయలసీమను వేరుగా చూడాలన్న సంకేతం ఇస్తున్నట్టయింది.

28 కల్లా సమస్యను పరిష్కరిస్తామన్న హోం మంత్రి షిండే హామీ యుపిఎ ప్రభుత్వం ఇచ్చినది కాగా, మూడుప్రాంతాల నాయకులతో మాట్లాడిన తరువాతే అంటున్న ఎఐసిసి ప్రధానకార్యదర్శి ఆజాద్ ప్రకటన కాంగ్రెస్ విధానంగా స్పష్టమౌతోంది. రాజమండ్రి సభ అనంతరం రేగిన ఉద్రిక్తతల నేపధ్యంలో అజాద్ ప్రకటన రాయలసీమలో వేర్పాటు వాదానికి తెరతీసేదిగా వుంది.

మనుషుల్ని ప్రాంతాలవారీగా చీల్చేసి పబ్బం గడుపుకోవాలన్న దుర్నీతి కాంగ్రెస్ కి కొత్తేమీ కాదుకదా!

No comments:

Post a Comment