Monday, March 18, 2013

టేబుల్ టెన్నిస్ ను పట్టణ మధ్య తరగతికి చేర్చిన భాస్కర్ రామ్ జాతీయ ఉపాధ్యక్షుడు

టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రసిడెంట్ గా వి.భాస్కర్ రామ్ ఎన్నికయ్యారు

రాజమండ్రి పౌరప్రముఖుడు, తీరికలేని ఛార్టెడ్ ఎకౌంటెంట్, స్వయంగా క్రీడాకారుడు అయిన భాస్కర్ రామ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

లక్నోలో 17 3 2013 సాయంత్రం ఈయన్ని నేషనల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అంతేకాకుండా నేషనల్ టేబుల్ టెన్నిస్ డెవలప్ మెంటు కమిటి ప్రసిడెంటుగా కూడా నియమించారు.

పట్టణ సంపన్న వర్గాలకే పరిమితమైవున్న టేబుల్ టెన్నిస్ ను మనరాష్ట్రంలో మధ్యతరగతి వర్గాల్లోకి రావడం వెనుక భాస్కర్ రామ్ నిబద్ధత ఆచరణాత్మకమైన కృషి వున్నాయి. రాజమండ్రిలో ఈయన నిర్వహించిన జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలు ఎందరెందరో టీనేజర్లనువిశేషంగా ప్రభావితంచేశాయి. మరే పట్టణంలోనూలేనంత హెచ్చు మంది టిటి ప్లేయర్లు రాజమండ్రిలో వున్నారంటే ఆ క్రెడిట్ భాస్కర్ రామ్ దే!



No comments:

Post a Comment