Thursday, March 21, 2013

ఉన్నది కాంగ్రెస్ లో షికారు జగన్ తో మరో 38 మంది ఎమ్మల్యేలు!

ఏకంగా 47 మంది కాంగ్రెస్ ఎమ్మల్యేలు వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి హాజరుకాకపోవటం చిన్న విషయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యల తీవ్రతను బయటపెట్టేదే. గైర్ హాజరైన వారి సంఖ్యను మీడియా పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా వుంది
కాంగ్రెస్ ఎమ్మెల్యెల్లో ఇప్పటికే బయట పడిన వారు మినహా మరో 38 మంది మద్దతు జగన్ కి వుంటుందనీ లేదా వారంతా కిరణ్ కుమార్ ని వ్యతిరేకిస్తున్నారనీ అర్ధమౌతోంది
తిరగబడిన శత్రువుకంటే లోపలే వుండి వ్యతిరేకించే శక్తులే అధికార పీఠానికి ప్రమాదకరం. క్రమంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి లోపలే వుండి వ్యతిరేకించేవారి సంఖ్య పెరుగుతున్నట్టుంది.
34మంది మంత్రులు పాతికమంది ఎమ్మెల్సీలు హాజరైన నిన్నటి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి 146 మంది ఎమ్మేల్యేలలో 65 మందే హాజరయ్యారని జర్నలిస్ట్ మిత్రుడొకరు చెప్పారు. 47 మంది మీటింగ్ ఎగ్గొట్టారు.
అవిశ్వాస తీర్మానం విషయంలో తెలుగుదేశంపార్టీ తటస్ధత ను పాటించడం తో కిరణ్ కుమార్ ఆపార్టీ మద్దతుకూడా పరోక్షంగా పొందినట్టయింది. ఇందిరమ్మబాట లాంటి ఇంటరాక్టివ్ యాత్రలు నామినేటెడ్ ముఖ్యమంత్రిని
ప్రజల్లోకితీసుకువెళుతున్నాయి. సహకారఎన్నికలు ఆయన్ని ఢిల్లీలో కాలర్ ఎగరేసుకునేలా చేశాయి. ఎస్ సిలకు ప్రవేశపెట్టిన సబ్ ప్లాన్ సమాజంలో అన్ని వర్గాలూ కిరణ్ వైపు ఆసక్తిగా ఆశగా చూసేలాచేసింది. జనరల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి మార్చే అవకాశాలు వుండవని కూడా అందరికీ తెలిసిందే.
ఇన్ని అనుకూలతలు బలపడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సి ఎల్ పి సమావేశానికి 47 మంది వెళ్ళకపోవడం రెండు విధాలుగా అర్ధమౌతోంది
ఒకటి అందరినీ కలుపుకుని వెళ్ళలేని కిరణ్ కుమార్ స్వభావం. సమావేశానికి వెళ్ళకపోయినా పదవులు ఊడిపోవు కనుక అటువంటి నాయకుడి వద్దకు వెళ్ళడానికి ఆత్మాభిమానం అడ్డు పడటం
రెండు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనబడుతున్న ప్రజాభిమానం చూసి ఆపార్టీవైపు చేరిపోవాలన్న ఆలోచనతో మరిన్ని'బంధాలు' తగిలించుకోకుండా గైర్ హాజరవ్వడం
కారణమేదైనా కాంగ్రస్ నుంచి ఎన్నికైన వారిలో 47 మంది గోడమీద పిల్లుల్లా వున్నరనుకోవలసి వస్తోంది. వీరిలో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన 9 మందినీ మినహాయిస్తే 38 మందీ జగన్ పార్టీ వైపు చూస్తున్నారనే అర్ధమౌతోంది


No comments:

Post a Comment