Tuesday, February 26, 2013

హైదరాబాద్ 2 వ రాజధాని అయితేనే న్యాయం

హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేస్తే తప్ప రాష్ట్రానికి న్యాయం జరగదని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం పేర్కొంది. కేంద్ర మంత్రి బన్సల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీలను సంతృప్తి పరిచే విధంగా ఉందని తెదేపా ఎద్దేవా చేసింది.

ఈ బడ్జెట్లోనూ రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని తెదేపా మండిపడింది. ఏటికేడు ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరుగుతుందని తెదేపా దుయ్యబట్టింది.

బన్సల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అమేథి-రాయబరేలి బడ్జెట్గా మాత్రమే ఉందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఎద్దేవా చేశారు. తిరుపతి-షిరిడి మధ్య కొత్త రైలు ఏర్పాటు చేయాలని విన్నవించినా పట్టించుకోలేదన్న శివప్రసాద్ ఆయన తలపై తెల్ల వస్త్రం కప్పుకుని నిరసన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment